వీరిద్దరి వల్ల వైసీపీ ప్రభుత్వం కూలిపోతుంది: జనసేన నేత పోతిన
- చింతమనేని, వనజాక్షి వ్యవహారం వల్ల టీడీపీ ప్రభుత్వం కూలిపోయింది
- వెల్లంపల్లి, దుర్గ గుడి ఈవో వల్ల వైసీపీ ప్రభుత్వం పతనమవుతుంది
- అమ్మవారి డబ్బులు, ఆలయ భూములను కాజేశారు
అన్యాయానికి అండగా ప్రభుత్వం నిలబడితే... చరిత్ర పునరావృతం అవుతుందని తెలిపారు. అమ్మవారి డబ్బులు, ఆలయాల భూములను వెల్లంపల్లి అడ్డంగా దోచుకున్నారని చెప్పారు. వెల్లంపల్లితో తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేయిస్తే వైసీపీ ఓడిపోతుందని... అందుకే ప్రచారం చేసే వారి జాబితాలో ఆయన పేరును చేర్చలేదని తెలిపారు.