ఉత్తమ పనితీరు కనబరిచే వలంటీర్లకు ఉగాది రోజున సత్కారం: సీఎం జగన్
- ప్రణాళిక శాఖపై సీఎం జగన్ సమీక్ష
- వలంటీర్లను ప్రోత్సహించాలని నిర్ణయం
- పనితీరు ఆధారంగా సేవారత్న, సేవామిత్ర పురస్కారాలు
- లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సూచన
ఇక, ఇతర అంశాల గురించి ప్రస్తావిస్తూ... ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయా? అని అధికారులను అడిగారు. దీనిపై అధికారులు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని సీఎం వారికి పలు సూచనలు చేశారు. సుస్థిర గ్రామాభివృద్ధి కోసం లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితితో పాటు దాని అనుబంధ విభాగాలు, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కో వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని అధికారులకు సూచించారు.