అందుకే దేశంలో వ్యాక్సిన్లపై ఆరోపణలు చేస్తున్నారు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- బుద్ధిమాంద్యం ఉన్నవారు విమర్శలు చేస్తున్నారు
- శాస్త్రవేత్తలపై నమ్మకం లేనివారే నిరాధార ఆరోపణలు చేస్తారు
- భారతీయ శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితం వ్యాక్సిన్లు
- కాంగ్రెస్ నేతల ఆలోచన విధానంలో మార్పు రావాలి
మన దేశంలో అనుమతులు పొందిన ఈ వ్యాక్సిన్లు దేశీయ ఔషధ సంస్థలు, భారతీయ శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితంగా వచ్చాయని తెలిపారు. దేశంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చొరవను భారత ప్రజలంతా కొనియాడుతున్నారని ఆయన చెప్పారు. కొందరు మాత్రం అందుకు భిన్నంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతల ఆలోచన విధానంలో మార్పు రావాలని, ప్రతి అంశాన్ని తప్పుడు పద్ధతిలో చూసే తీరు సరికాదని చెప్పారు.