సోము వీర్రాజు సీఎం జగన్ కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మాట్లాడుతున్నారు: వర్ల రామయ్య

  • రాష్ట్రంలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం
  • హోంమంత్రి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న సోము వీర్రాజు
  • చర్యలు తీసుకునేది ఎవరంటూ ప్రశ్నించిన వర్ల
  •  పాపం హోంమంత్రిని అడుగుతారా? అంటూ వ్యాఖ్యలు
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం జరుగుతుంటే హోంమంత్రి సుచరిత ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, దీన్నిబట్టే జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో నేత వర్ల రామయ్య స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు గారు సీఎం జగన్ కు ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓవైపు దేవాలయాలపై దాడులు జరుగుతుంటే చర్యలు తీసుకునేది ఎవరు? ఈ అంశంలో ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా, పాపం హోంమంత్రిని అడగడం చూస్తుంటే ముఖ్యమంత్రి పట్ల ఆయన ఉదారంగా ఉన్నారని అర్థమవుతోంది... అవునా? అంటూ ప్రశ్నించారు.

Varla Ramaiah
Somu Veerraju
Idols
Vandalize
Jagan
Mekathoti Sucharitha
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News