అనంత్ నాగ్ లో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్న జవాన్లు!

  • జవాన్లకు తారసపడిన ఉగ్రవాదులు
  • ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదికి గాయాలు
  • జహీర్ అబ్బాస్ గా గుర్తించామన్న ఆర్మీ అధికారి
జమ్ము కశ్మీర్ పరిధిలోని అనంత్ నాగ్ లో ఓ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. గురువారం నాడు ఈ ప్రాంతంలోని బాబాగుండ్ ఖలీల్ ప్రాంతంలో పోలీసులకు ఉగ్రవాదులు తారసపడగా ఎన్ కౌంటర్ జరిగింది. ఆపై గాయపడిన ఓ టెర్రరిస్ట్ ను జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.

 పట్టుబడిన ఉగ్రవాదిని పుల్వామా జిల్లాకు చెందిన జహీర్ అబ్బాస్ గా గుర్తించామని, ఎన్ కౌంటర్ లో అతని పొత్తి కడుపులో బుల్లెట్ దిగిందని, అతన్ని ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని ఆర్మీ అధికారులు తెలిపారు. శ్రీనగర్ లోఉన్న ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని, కోలుకున్న తరువాత తదుపరి విచారణ జరుగుతుందని అన్నారు.

Jammu And Kashmir
Terrorist
Encounter
Anantnag

More Telugu News