డోర్ డెలివరీ సేవలు ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ కార్గో
- కొన్నాళ్లుగా కార్గో సేవలు అందిస్తున్న ఆర్టీసీ
- ఇకపై నేరుగా ఇంటికే పార్శిళ్లు
- ఖైరతాబాద్ లో ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- నగరంలో మూడు ఏజెన్సీలు సేవలందిస్తాయని వెల్లడి
- ప్రజల్లో ఆర్టీసీ కార్గో సేవలకు ఆదరణ లభిస్తోందని వివరణ
ఈ మేరకు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ లో ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించారు. కార్గో సేవల ద్వారా ఆర్టీసీకి రోజుకు రూ.15 లక్షల వరకు ఆదాయం వస్తోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. హైదరాబాదు నగరంలో ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్ పల్లి ప్రాంతాల పరిధిలో మూడు ఏజెన్సీలు ఈ డోర్ డెలివరీ సేవలు నిర్వహిస్తాయని వివరించారు. కార్గో సేవలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని అన్నారు.