తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

  • కొత్తగా 609 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,71,492
  • కోలుకున్న వారు 2,61,028 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,465
తెలంగాణలో గత 24 గంటల్లో 609 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 873 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,71,492కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,61,028 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,465కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 8,999 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,922 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 114, రంగారెడ్డి జిల్లాలో 48 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
 


More Telugu News