జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్ నమోదు.. గతం కంటే కాస్త ఎక్కువే!
- 2016లో నమోదైన పోలింగ్ శాతం కంటే కొద్దిగా అధికం
- ముగిసే సమయంలో ఊపందుకున్న పోలింగ్
- ఓల్డ్ మలక్పేట డివిజన్లో రేపు రీపోలింగ్
సాయంత్రం ఐదు గంటల సమయానికి కూడా 36.73 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అయితే, పోలింగ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా నెమ్మదిగా ఊపందుకోవడంతో ఆ మాత్రమైనా నమోదైంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడానికి తోడు కరోనా భయంతో పోలింగ్ కేంద్రాలకు రావడానికి జనం సంకోచించినట్టు తెలుస్తోంది. ఒక్క ఓల్డ్ మలక్పేట మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ రేపు రీపోలింగ్ నిర్వహించనున్నారు.