దయచేసి నన్ను 'అహంకారి' అనవద్దు: నితీశ్ కుమార్
- బీహార్ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన జేడీయూ
- బీజేపీతో కలిసుండటంతో మరోసారి నితీశ్ కు చాన్స్
- కరోనా కారణంగానే ప్రజలను కలవలేకపోయాను
- ఓ ఇంటర్వ్యూలో నితీశ్ కుమార్
తాజాగా ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, "దయచేసి నన్ను అహంకారినని, గర్విష్ఠినని అనవద్దు" అంటూ చేతులు జోడించి వేడుకున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) కేవలం 43 స్థానాలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. విపక్ష ఆర్జేడీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్నా, బీజేపీతో కూటమిలో కలిసున్నందున నితీశ్ కు మరోసారి సీఎంగా పనిచేసే అవకాశం లభించింది.