సోనూ సూద్ కు శాలువా కప్పి సన్మానించిన ప్రకాశ్ రాజ్... వీడియో ఇదిగో!

  • లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ దాతృత్వం
  • వలస జీవుల పాలిట దేవుడిలా మారిన సోనూ సూద్
  • అల్లుడు అదుర్స్ సెట్స్ పై సోనూను అభినందించిన ప్రకాశ్ రాజ్
లాక్ డౌన్ సమయంలో అపర దాతగా పేరొందిన సినీ నటుడు సోనూ సూద్ ను నట దిగ్గజం ప్రకాశ్ రాజ్ ఘనంగా సన్మానించారు. అల్లుడు అదుర్స్ సెట్ లో ఈ సత్కార కార్యక్రమం జరిగింది. సోనూ సూద్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించిన ప్రకాశ్ రాజ్, ఆయనకు ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ క్రమంలో అల్లుడు అదుర్స్ సెట్ లో సందడి వాతావరణం నెలకొంది. కష్టకాలంలో సోనూ సూద్ ఆపన్నులకు అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ కొనియాడారు. సోనూను మనస్ఫూర్తిగా అభినందించారు.

కేంద్రం కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వలస కార్మికులు, పేదల పాలిట తీవ్ర విఘాతంలా పరిణమించింది. ఈ నేపథ్యంలో సోనూ సూద్ బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి వలసజీవులను వారి స్వస్థలాలకు చేర్చారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అపర దానకర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.



More Telugu News

Prakash Raj Sonu Sood Felicitation Alludu Adurs Lockdown Corona Virus India