రేపటి నుంచి ఏపీలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు
- సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకోబోతున్న పాఠశాలలు
- తొలి రోజు ఉపాధ్యాయులందరూ హాజరు కావాల్సిందే
- 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అనుమతి నిల్
1 నుంచి 8వ తరగతి విద్యార్థులను పాఠశాలలకు అనుమతించరు. అయితే, 9 నుంచి ఇంటర్ చదివే వారు మాత్రం తల్లిదండ్రుల అనుమతితో సందేహాలు నివృత్తి చేసుకునేందుకు వెళ్లొచ్చు. రెసిడెన్షియల్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా బోధిస్తారు. అవసరం అనుకుంటే పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయుల సూచనలు తీసుకోవచ్చు. విద్యావారధి, విద్యామృతం వంటి కార్యక్రమాలు వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.