సోనియాకు లేఖ రాసి అలజడి రేపిన కాంగ్రెస్ బహిష్కృత నేతలు
- ప్రస్తుతం పార్టీ నడుస్తున్న తీరు బాగోలేదు
- కార్యకర్తల్లో గందరగోళం
- కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించాలి
- ప్రజాస్వామ్య విలువలు పునరుద్ధరించాలి
ప్రస్తుతం పార్టీ నడుస్తున్న తీరు చూస్తుంటే కార్యకర్తల్లో గందరగోళాన్ని నెలకొల్పే విధంగా ఉందని అన్నారు. కార్యకర్తల్లో నిరాశ ఆవహిస్తోందని, భారత్ లో ప్రజాస్వామ్య విలువలు నాశనమవుతున్న ప్రస్తుత సమయంలో దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందని వారు చెప్పుకొచ్చారు. ఆ పార్టీ సమర్థంగా కొనసాగాలని, అందుకు కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించాలని, పార్టీ సంప్రదాయాలతో పాటు ప్రజాస్వామ్య విలువలు
పునరుద్ధరించాలని లేఖలో కోరారు.