పోలీసులతో గొడవపడిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య!
- గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన
- మాస్క్ లేకుండా బయటకు వచ్చిన రివాబా జడేజా
- ఆపిన మహిళా కానిస్టేబుల్ తో వాగ్వాదం
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రివాబా, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రివాబా జడేజా, మాస్క్ ధరించకపోవడమే ఈ వాగ్వాదానికి కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలిందని మనోహర్ సింగ్ తెలియజేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని అన్నారు. ఈ వాగ్వాదం తరువాత కానిస్టేబుల్ సోనాల్ గోసాయి, స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొద్ది గంటల తరువాత ఆమె కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు. కాగా, ఈ గొడవపై ఇంతవరకూ ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలుస్తోంది.