తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయకపోవడం వల్ల 98 లక్షల మంది నష్టపోతున్నారు: జేపీ నడ్డా
- వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్న నడ్డా
- హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా సర్కారులో చలనంలేదని విమర్శలు
- కేసీఆర్ ను కుంభకర్ణుడితో పోల్చిన నడ్డా
కేంద్రం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల 98 లక్షల మందికి బీమా సౌకర్యం దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నా కేసీఆర్ సర్కారులో చలనం లేదని అన్నారు. తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు వర్చువల్ విధానంలో భూమిపూజలు నిర్వహించగా, జేపీ నడ్డా ఢిల్లీ నుంచే వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.