యూపీఎస్సీ ఫలితాల్లో '420'వ ర్యాంకు సాధించిన 'రాహుల్ మోదీ'పై ట్రోలింగ్
- అభ్యర్థి పేరు రాహుల్ మోదీ కావడంతో ట్రోల్
- #RahulModi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్
- మీమ్స్ సృష్టిస్తోన్న నెటిజన్లు
రాజకీయాల్లో మోదీ, రాహుల్ విమర్శలు గుప్పించుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఆ రెండు పార్టీల నాయకుల పేరు కలిసే ఉండటంతో ఆ యూపీఎస్సీ అభ్యర్థిపై నెటిజన్ల దృష్టి పడింది. #RahulModi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మోదీ, రాహుల్ ఫొటోలను జత చేస్తూ మోదీతో పాటు రాహుల్ యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై మీమ్స్ సృష్టిస్తున్నారు.