Prabhas: గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్

  • కరోనా కాలంలోనూ కొనసాగుతున్న చాలెంజ్
  • ప్రభాస్ నివాసానికి వచ్చిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్
  • ఎంపీతో కలిసి మొక్కలు నాటిన ప్రభాస్
Tollywood hero Prabhas accepts Green India Challenge

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ సెలబ్రిటీలకు ఇష్టమైన చాలెంజ్ గా మారిపోయింది. కరోనా కాలంలోనూ ఇది కొనసాగడం విశేషం. తాజాగా ఈ చాలెంజ్ లో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఆద్యుడైన ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి తన నివాసంలో మొక్కలు నాటారు. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ మాస్కు ధరించిన ప్రభాస్, సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అనంతరం ఓ సెల్ఫీతో ముగించారు.

More Telugu News