ఇండియాలో తొలిసారి... చికిత్స కేసులను దాటేసిన రికవరీలు!
- మొత్తం కేసుల సంఖ్య 2,76,583
- చికిత్స తరువాత రికవరీ అయిన 1,35,206
- ప్రస్తుతం ఐదో స్థానంలో ఇండియా
ఇంతవరకూ ఇండియాలో 7,745 మంది వైరస్ సోకి మరణించగా, 279 మంది గడచిన 24 గంటల్లో చనిపోయారు. ప్రస్తుతం ఇండియా మొత్తం కేసుల సంఖ్య విషయంలో ఐదో స్థానంలో ఉంది. ఇండియాకన్నా ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే దేశాలు కొనసాగుతున్నాయి. ఇండియాలో కరోనాకు అతిపెద్ద హాట్ స్పాట్ గా ఉన్న మహారాష్ట్రలో సమూహ వ్యాప్తి లేదని ఆ రాష్ట్ర వైద్య మంత్రి రాజేశ్ తోపే వ్యాఖ్యానించారు.