ఎడిసన్ వ్యాధితో తన పోరాటం గురించి వివరించిన సుస్మితా సేన్
- 2014లో ఎడిసన్ వ్యాధి బారినపడ్డట్టు వెల్లడి
- ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వివరణ
- నాన్ చాక్ ప్రాక్టీసుతో పెరిగిన ఆత్మస్థైర్యం
- 2019 నాటికి స్వస్థత పొందానన్న సుస్మిత
ఎడిసన్ వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు కొన్ని స్టెరాయిడ్స్ తీసుకోవడంతో దుష్పరిణామాలు కలిగాయని, దాంతో జీవితంపై నిరాశ కలిగిందని, వ్యాధి ఇక ఎప్పటికీ తగ్గదేమోనని భావించానని తెలిపారు. కానీ, జీవితంపై అనురక్తితో తనను తాను పునరుజ్జీవం చేసుకోవాలని తలంచి, నాన్ చాక్ మార్షల్ ఆర్ట్ నేర్చుకుని ఎంతో మానసిక స్థైర్యం అందుకోవడంతోపాటు క్రమంగా ఆరోగ్యవంతురాలినయ్యానని సుస్మిత వెల్లడించారు.
2019 నాటికి ఎడిసన్ వ్యాధి ప్రభావం నుంచి కోలుకున్నానని వివరించారు. మన శరీరం గురించి మనకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని, ఆరోగ్యంగా ఉండడం కోసం శరీరం చెప్పే మాట వినాలని సూచించారు.