జగన్ మాత్రం మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టారు: నిమ్మల రామానాయుడు

TDP Leader Nimmala Ramanaidu criticises CM Jagan
  • జగన్ హయాంలో మద్యం ఆదాయం పెరిగింది
  • మద్య పాన నిషేధం చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది
  • మరి, అలాంటప్పుడు మద్యం ఉత్పత్తి పరిశ్రమలు ఎందుకు?
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు విమర్శలు గుప్పించారు. ‘కరోనా’ నివారణ కోసం ప్రజలంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంటే. జగన్ మాత్రం మద్యం అమ్మకాల వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో మద్యం ఆదాయం పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని, అలాంటప్పుడు, కొత్తగా మద్యం ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకోవడం ఎందుకని ప్రశ్నించారు.
Go Back to Shorts
Nimmala Rama Naidu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News