కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో రోగులకు చికిత్స: ఎయిమ్స్ డైరెక్టర్
- గతంలో ఎబోలాకు ఇదే తరహా చికిత్స
- రోగిలో రోగనిరోధక శక్తిని పెంచే రక్తంలోని ప్లాస్మా
- ప్లాస్మా థెరపీకి ఇప్పటికే ఐసీఎంఆర్ అనుమతి
కరోనా రోగి శరీరంలో రోగ నిరోధక శక్తిని ఈ ప్లాస్మా పెంచుతుందని ఆయన అన్నారు. ఈ తరహా యాంటీ బాడీలను అధికంగా కలిగివున్న రోగి, చికిత్స తరువాత కోలుకుంటే, అతని రక్తాన్ని దానం చేయాలని కోరవచ్చని, దాన్నుంచి తీసే ప్లాస్మాను మరో రోగికి ఎక్కించడం ద్వారా, అతన్ని త్వరగా కరోనా నుంచి బయటపడేయవచ్చని తెలిపారు. గతంలో ఎలోబా వంటి వైరస్ లు విజృంభించినప్పుడు, ఇదే తరహా ప్లాస్మా థెరపీని వాడినట్టు ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని పాటిస్తున్నారని, అక్కడి నుంచి వెలువడే గణాంకాలు కరోనాపై పోరులో ఉపయుక్తకరమని భావిస్తే, భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తామని రత్నదీప్ వెల్లడించారు. కాగా, ప్లాస్మా థెరపీని అమలు చేసేందుకు కేరళలోని శ్రీ చిత్రా తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఐసీఎంఆర్ అనుమతి నిచ్చింది.