వైట్ హౌస్లో తొలి కరోనా కేసు నమోదు.. ట్రంప్ సర్కారు అప్రమత్తం
- ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలోని వ్యక్తికి కరోనా
- అమెరికాలో 230కి చేరిన మృతుల సంఖ్య
- 18 వేలు దాటిన బాధితుల సంఖ్య
ఇక, అమెరికాలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి 230 మంది ప్రాణాలు కోల్పోయారు. వాషింగ్టన్లో అత్యధికంగా 74 మంది మృతి చెందారు. గత రెండు రోజుల్లో ఏకంగా పదివేల కొత్త కేసులు అమెరికాలో నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18వేలు దాటిపోయింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అత్యవసర స్థితి ప్రకటించి ఆర్మీని రంగంలోకి దింపింది.