KCR: తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రినని కేసీఆర్ గుర్తుంచుకోవాలి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని కేసీఆర్ గుర్తుంచుకోవాలని.. ఆయన కేవలం గజ్వేల్ నియోజకవర్గానికి మాత్రమే సీఎం కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, అవేవీ సరిగా అమలు చేయడం లేదని రాజాసింగ్ ఆరోపించారు. ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య ఏమైందని, ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.