Raghuveera Reddy: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన రఘువీరారెడ్డి

ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో నూతనంగా నిర్మించిన 52 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా చిరంజీవిని రఘువీరారెడ్డి ఆహ్వానించారు. విగ్రహావిష్కరణ మే 29న జరగనుంది. కాగా, నీలకంఠాపురంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయ కమిటీకి రఘువీరారెడ్డి చైర్మన్ గా ఉన్నారు.
Raghuveera Reddy
Chiranjeevi
Nilakanthapuram
Lord Hanuman Statue
Opening Ceremony

More Telugu News