ఏపీ మండలి సెలెక్ట్ కమిటీలకు పేర్లు పంపిన టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్

  • సెలెక్ట్ కమిటీలకు 3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు
  • బీజేపీ నుంచి మాధవ్, సోము వ్రీరాజు
  • పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు
ఇటీవల ఏపీ శాసనమండలిలో ఆమోదం పొందని రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీలకు పంపిన విషయం తెలిసిందే. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు నిమిత్తం బీజేపీ, పీడీఎఫ్ లు తమ ఎమ్మెల్సీల పేర్లు పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ ఇటీవల సూచించారు. ఈ సూచనల మేరకు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ లు తమ సభ్యుల పేర్లను సెలెక్ట్ కమిటీకి పంపాయి.

టీడీపీ నుంచి నారా లోకేశ్, అశోక్ బాబు, తిప్పేస్వామి, బీటీనాయుడు, సంధ్యారాణి (మూడు రాజధానుల బిల్లుకు), దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, బుద్ధా వెంకన్న, బీదా రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు (సీఆర్డీఏ రద్దు బిల్లు)

బీజేపీ నుంచి మాధవ్ (మూడు రాజధానుల బిల్లు), సోము వీర్రాజు (సీఆర్డీఏ రద్దు బిల్లు)

పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు (మూడు రాజధానుల బిల్లు),  ఇళ్ల వెంకటేశ్వరరావు (సీఆర్డీఏ రద్దు బిల్లు)
Go Back to Shorts
BJP
PDF
AP Legislative Council
Select committee

More Telugu News