కర్రలతో దాడి చేసుకున్న వైసీపీ వర్గీయులు.. ముగ్గురి పరిస్థితి విషమం

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అంతర్గత ఆధిపత్య పోరు ఎక్కువవుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లిలో జరిగింది. పెద్దిరెడ్డి, భోగతి నారాయణరెడ్డిల మధ్య జరిగిన ఘర్షణ పరస్పర దాడులకు దారి తీసింది. ఇరు వర్గీయులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన నేపథ్యంలో గ్రామంలోని పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయేమోనని గ్రామస్తులు భయపడుతున్నారు.
Go Back to Shorts
YSRCP
Fight
Anantapur District

More Telugu News