తెలుగు భాష అమ్మఒడి లాంటిది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం
  • భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి
  • మన కట్టూబొట్టు మరచిపోకూడదు
హైదరాబాద్ లోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఈరోజు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడి కుటుంబసభ్యులు, ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని, మన కట్టూబొట్టు మరచిపోకూడదని సూచించారు. తెలుగు భాష అమ్మఒడి లాంటిదని, దీనిని అందరూ కాపాడుకోవాలని అన్నారు.
 
దేశ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు ఒక బ్రాండ్: గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ, తెలుగు సంప్రదాయం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుపై ప్రశంసలు కురిపించారు. దేశ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు ఒక బ్రాండ్ అని, ఆయన సేవలు సమాజ హితానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు.
Go Back to Shorts
Hyderabad
vicepresident
Venkaiah Naidu
Tamili sye

More Telugu News