రాయలసీమ అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని టీడీపీని కోరుతున్నా: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్

  • ఇప్పటివరకూ రాయలసీమ చాలా నష్టపోయింది
  • ‘సీమ’ అభివృద్ధికి నష్టం కలిగించొద్దు
  • చంద్రబాబు దొంగ నాటకాలను ఎవరూ నమ్మరు
రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దొంగ నాటకాలు ఆడుతున్నారని, ఆయన్ని ఎవరూ నమ్మరని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. ఇప్పటివరకూ రాయలసీమ చాలా నష్టపోయిందని, ‘సీమ’ అభివృద్ధికి నష్టం కలిగించొద్దని టీడీపీని కోరుతున్నానని అన్నారు. మూడు రాజధానులను ముగ్గురు కొడుకులుగా చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉందని, రాయలసీమను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని జగన్ ని కోరుతున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Rayalaseema
Hindupuram
Mp
Madhav

More Telugu News