రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష
- పౌరసత్వ సవరణ చట్టంను నిరసిస్తూ.. నిరసన
- రాజ్యాంగంలోని ప్రవేశికను చదివిన సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్
- రాజ్యాంగాన్ని రక్షించాలంటూ పిలుపు
ఈ సందర్భంగా సోనియా గాంధీ సహా, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ రాజ్యాంగంలోని ప్రవేశికను చదివి వినిపించారు. ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ సత్యాగ్రహ దీక్ష దేశ ప్రజల సమైక్యత కోసమేనని చెప్పారు. రాజ్యాంగాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజలు, ముఖ్యంగా యువత కేంద్రం చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పవిత్రతను కాపాడాలని యువత కోరుకుంటోందన్నారు. వారికి కాంగ్రెస్ మద్దతునిస్తుందని చెప్పారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా తమ పార్టీ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు.