జగన్ తన కులం మాట తప్పదని అంటున్నారు, మిగతా కులాలు మాట తప్పుతాయా?: పవన్ కల్యాణ్
- రాయలసీమలో పవన్ పర్యటన
- తిరుపతిలో న్యాయవాదులతో సమావేశం
- జగన్, వైసీపీ నేతలపై విమర్శలు
అంతేకాకుండా వైసీపీ మంత్రులపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. చట్టాలు కాపాడాల్సిన మీరే పిచ్చికూతలు కూస్తుంటే రోడ్లపైన తిరిగే నలుగురు కుర్రాళ్లకు అమ్మాయిని చూస్తే మానభంగం వంటి ఆలోచనలు రాక ఇంకేం వస్తాయని ప్రశ్నించారు. సమస్యలు కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోలేనని, మనస్సాక్షితో సమస్యల పట్ల స్పందిస్తానని తెలిపారు. సమస్యలు ఎదురైతే కళ్లకు గంతలు కట్టుకుని ఉండలేనని అన్నారు. తాను రాజకీయాల్లోకి తెగించే వచ్చానని స్పష్టం చేశారు.
న్యాయవాదుల సమస్యలపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని, కోర్టుల వద్ద న్యాయవాదులకు సరైన సదుపాయాలు లేవని అభిప్రాయపడ్డారు. దేశం కోసం చచ్చిపోవడానికైనా సిద్ధంగా కొందరున్నారని చెప్పడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.