విమర్శిస్తే విరుచుకుపడతారా?: వైసీపీ నేతలపై కన్నా ఆగ్రహం

చంద్రబాబుపాలన, జగన్ పాలన మధ్య తేడా లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలకు, కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇసుకపాలసీ పేరుతో కృత్రిమ కొరతను సృష్టించారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న శ్రద్ధ ఇసుక మీద లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతూ సమస్యలను పక్కదోవపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Kanna lakshminarayana
criticism on YCP
Andhra Pradesh

More Telugu News