ప్రకాశం జిల్లా చిన్నారి ‘వెలివేత’పై సీఎం జగన్ కు అసలు లేఖే రాయలేదట!
- విచారణకు ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్
- ఊరి పొలాన్ని తన పేరుపై రాయించుకున్న పుష్ప తాత
- ఈ చర్యకు నిరసనగా కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు
దీంతో గ్రామపెద్దలు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేశారు. దీంతో ఈ వ్యవహారంపై వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ కు జూలై 22న ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరిపారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండాలని అధికారులు సూచించినా, వాళ్లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈ సమస్యను ఫిర్యాదు అందిన రెండ్రోజుల్లోనే పరిష్కరించామని స్థానిక అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
అయితే తాజాగా రామచంద్రాపురంలో పరిస్థితి బాగానే ఉందని జిల్లా అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్ ను అసలు విద్యార్థిని పుష్ప రాయలేదని స్పష్టం చేశారు. పుష్పతో పాటు విద్యార్థులంతా స్కూలుకు వస్తున్నారని చెప్పారు. ఎవరో ఆకతాయిలు కావాలనే ఈ లేఖను సృష్టించి ఉంటారని వ్యాఖ్యానించారు.