అమెరికాలో జగన్ ‘జ్యోతి ప్రజ్వలన’ వివాదం.. బీజేపీ విమర్శలకు వైసీపీ కౌంటర్!
- జగన్ హిందూ సంస్కృతిని అవమానించారన్న బీజేపీ
- అమెరికాలో విద్యుత్ దీపాలే ఉంటాయన్న వైసీపీ
- జగన్ మర్యాదపూర్వకంగా ప్రజ్వలన క్రతువును పూర్తిచేశారని వెల్లడి
బీజేపీ నేతలు, ఏపీ బీజేపీ విభాగం సిగ్గులేకుండా అభ్యంతరకరంగా వ్యవహరిస్తోందని వైసీపీ తెలిపింది. ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది. అమెరికా పర్యటన సందర్భంగా జగన్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారనీ, హారతి ఇచ్చారనీ, కుంకుమ తిలకం దిద్దారని వైపీపీ గుర్తుచేసింది.
ఇక ఫైర్ సేఫ్టీ కోడ్ కారణంగా అమెరికాలోని దీపాలన్నీ విద్యుత్ తో రూపొందించారని వైసీపీ తెలిపింది. జగన్ కొత్తగా వెలిగించడానికి అక్కడ ఆయిల్ దీపాలు లేవని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మర్యాదపూర్వకంగా విద్యుత్ దీపం దగ్గరకు వెళ్లిన జగన్.. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పూర్తిచేశారని పేర్కొంది. ఇందులో హిందూ సంస్కృతిని అగౌరవపర్చడం ఏముందని ప్రశ్నించింది. ఈ మేరకు వైసీపీ ట్విట్టర్ లో స్పందించింది.