జమ్మూ కశ్మీర్, లడఖ్ ల అభివృద్ధికి ఏం చేయనున్నదీ వెల్లడించిన ముఖేశ్ అంబానీ

  • జమ్మూ కశ్మీర్, లడఖ్ అభివృద్ధిలో భాగస్వాములవుతాం
  • రిలయన్స్ తరపున టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తాం
  • ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తాం
రానున్న రోజుల్లో కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, లడఖ్ లకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున కీలక ప్రకటనలు చేస్తామని ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. ఈరోజు ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలకు అండగా నిలవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అ రెండు ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములవుతామని తెలిపారు. దీని కోసం రిలయన్స్ తరపున ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని... ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు.

ఈనెల 8వ తేదీన జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, జమ్మూ కశ్మీర్, లడఖ్ లలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. అక్కడ పరిశ్రమలు వస్తే, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు.
Go Back to Shorts
Jammu And Kashmir
ladakh
Reliance
Mukesh Ambani

More Telugu News