పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసు: అమిత్ షా

  • పీఓకేలోని 25 స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తామన్న అమిత్ షా
  • పీఓకే ముమ్మాటికీ జమ్మూకశ్మీర్ లో అంతర్భాగమేనంటూ ఉద్ఘాటన
  • పరిస్థితులు చక్కబడితే జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని లోక్ సభ సాక్షిగా వెల్లడి
జమ్మూకశ్మీర్ బిల్లుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఎంతో తెగువ కనబర్చారని పేర్కొన్న అమిత్ షా, పరిస్థితులు చక్కబడిన తర్వాత జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా వస్తుందని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని 25 సీట్లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తామని, పీఓకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసని అన్నారు.

1948లో భారత సేనలు పాక్ ఆర్మీని తరుముకుంటూ బాలాకోట్ వరకు వెళ్లాయని, ఇంతలోనే నెహ్రూ భారత బలగాలను వెనక్కి పిలిపించారని, ఈ కారణంగానే పీఓకే మనకు దూరమైందని అమిత్ షా సభలో వివరించారు. పీఓకే ముమ్మాటికీ జమ్మూకశ్మీర్ లో అంతర్భాగమేనని అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఏడు దశాబ్దాల సమస్యకు తెరపడిందని అన్నారు. ఈ ఆర్టికల్ కారణంగానే కశ్మీర్ ను భారత్ నుంచి వేరుగా చూశారని, ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎవరికీ తలొగ్గదని ఉద్ఘాటించారు.
Go Back to Shorts
Amit Shah
Narendra Modi
Lok Sabha
POK

More Telugu News