వచ్చే నెలలో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

  • ఆగస్టు 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్న సీఎం
  • ప్రధాని సహా ఇద్దరు మంత్రులను కలవనున్న జగన్
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతినీ కలిసే అవకాశాలు
ఏపీ సీఎం జగన్ వచ్చే నెలలో ఢిల్లీ వెళుతున్నారు. ఆగస్టు 6, 7 తేదీల్లో ఢిల్లీలో  గడుపుతారు. జగన్ తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్ర సమస్యలు, పెండింగ్ లో ఉన్న అంశాల గురించి, ఆర్థిక సాయం గురించి వారి దృష్టికి తేనున్నట్టు సమాచారం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కూడా జగన్ కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Andhra Pradesh
cm
jagan
pm
modi

More Telugu News