ప్రియుడిని నిర్బంధించి, ప్రియారాలిపై అత్యాచారం... ప్రకాశం జిల్లాలో కలకలం!
- ఏకాంతంగా గడపాలని వెళ్లిన జంట
- ఆటకాయించి అత్యాచారం
- కేసును విచారిస్తున్న పోలీసులు
వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించారు. వారి సెల్ ఫోన్, దగ్గరున్న డబ్బు దోచుకున్నారు. యువతిని లాక్కెళ్లి, అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు ముగ్గురు ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.