టీమిండియా, శ్రీలంక మ్యాచ్ సందర్భంగా ఆకాశంలో వివాదాస్పద సందేశాన్ని ప్రదర్శించిన విమానం!

  • బ్యానర్ పై కశ్మీర్ నినాదం
  • సీరియస్ గా తీసుకున్న ఐసీసీ
  • స్థానిక పోలీసులకు సమాచారం
వరల్డ్ కప్ లో నిర్వహణ లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇవాళ టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య లీడ్స్ లో మ్యాచ్ జరుగుతుండగా మైదానం మీదుగా ఓ చిన్న విమానం వెళ్లింది. అయితే, ఆ విమానం ప్రదర్శించిన ఓ బ్యానర్ వివాదాస్పదమైంది. "కశ్మీర్లో భారత్ మారణహోమం ఆపాలి, కశ్మీర్ కు విమోచన కల్పించాలి" అనే నినాదం రాసి ఉన్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ ఆ విమానం వెళ్లడం పట్ల ఐసీసీ స్పందించింది.

ఇలాంటి చర్యలను అంగీకరించబోమని, ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం అందించామని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ టోర్నీలో ఇలాంటి ఘటన కొన్నిరోజుల క్రితం కూడా జరిగింది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు మ్యాచ్ ఆడుతుండగా, ఓ విమానం జస్టిస్ ఫర్ బెలూచిస్థాన్ అని రాసి ఉన్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ మైదానం చుట్టూ చక్కర్లు కొట్టింది. అదే సమయంలో మైదానంలో ఉన్న పాక్, ఆఫ్ఘన్ అభిమానులు కూడా బాహాబాహీకి దిగారు.
Go Back to Shorts
ICC
India
Sri Lanka
Plane

More Telugu News