రాళ్లదాడిపై స్పందించిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్!
- కొన్ని శక్తులు దీని వెనుక ఉన్నాయి
- ప్రజలంతా నా వెనుకే ఉన్నారు
- పగతో కొందరు నాపై దాడి చేయించారు
- మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ నేత
గోవింద్రాల గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిలో పలువురు టీఆర్ఎస్ నేతలకు గాయాలు అయ్యాయని హరిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఉన్న కక్షతోటి కొంతమంది నేతలు ఈ దాడి చేయించారనీ, దీంతో తనపై దాడిచేస్తున్న వారిపై ప్రజలు తిరగబడ్డారని చెప్పారు. కామేపల్లి మండలంలో ప్రస్తుతం గడీల రాజకీయాలు నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను గోవింద్రాల గ్రామస్తులు ఎవరూ అడ్డుకోలేదనీ, తనకు ప్రజాబలం ఉందని అన్నారు. తనపై ఈరోజు జరిగిన దాడి గిరిజన మహిళలు అందరిపై జరిగిన దాడేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు.