వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న బైక్.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
- వరంగల్ రైల్వే స్టేషన్కు వెళ్తుండగా ఘటన
- పంథిని వద్ద అదుపు తప్పిన బైక్
- ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు
దీంతో తమను వరంగల్ రైల్వే స్టేషన్లో వదిలిపెట్టాలంటూ వారు కోరడంతో ఆదిత్య సరేనని బైక్ తీసుకొచ్చాడు. ముగ్గురూ కలిసి వరంగల్ బయలుదేరారు. పంథిని సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆదిత్య, రాంసాయిలు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మురళీధర్రావు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.