టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన బోండా ఉమ

  • ఉమతో పాటు బీకే పార్థసారధి కూడా రాజీనామా
  • నామినేషన్ దాఖలు చేయనున్న ఉమ
  •  రాజీనామాలను ఆమోదించిన ప్రభుత్వం
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన నామినేషన్ వేయనున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతూ నామినేషన్ దాఖలు చేస్తే అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందని భావించి బోండా ఉమ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమతో పాటు బీకే పార్థసారధి కూడా రాజీనామా చేయగా, వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
Go Back to Shorts
Bonda Uma
Pardhasarathi
Nomination
TTD
Resignation

More Telugu News