టీడీపీ గూటికి బైరెడ్డి రాజశేఖరరెడ్డి... అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం!
- శ్రీశైలం నుంచి పోటీ చేయించే అవకాశం
- గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి
- మధ్యలో కొంతకాలం రాయల సీమ హక్కుల కోసం ఉద్యమం
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో ఆయనకు విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. తాజాగా టీడీపీలో చేరేందుకు మంతనాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని శ్రీశైలం స్థానం నుంచి పార్టీ టికెట్టు కేటాయించిన బుడ్డా రాజశేఖరరెడ్డి పోటీకి విముఖత చూపించడంతో సరైన అభ్యర్థి కోసం టీడీపీ వెతుకుతోంది.
ఈ నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బైరెడ్డి పార్టీలో చేరితే ఆయనను శ్రీశైలం స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.