janasena: రాజమండ్రి, అమలాపురం జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే!
32 శాసనసభ, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి జాబితాను సిద్ధం చేశారు. ఇందులో రెండు పార్లమెంటు స్థానాలకు ఖరారు చేసిన అభ్యర్థులను జనసేన ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్ లను పవన్ ఖరారు చేశారు. ఈ సాయంత్రంలోగా మిగిలిన అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది.