ఎన్నో అవమానాలు ఉంటాయి.. నాలాంటి వాళ్లకు ఈ పదవి సరిపోదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవి అంటే అందరూ ఆషామాషీ అనుకుంటారని... కానీ ఆ పదవిలో ఉన్న వారికి అది ఒక గుదిబండలా ఉంటుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే పదవి ఒక ముళ్ల కిరీటం వంటిదని... తనలాంటి నైజమున్నవారికి ఆ పదవి సరిపోదని చెప్పారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్నవారు ఎన్నో విమర్శలు, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

ప్రతి మనిషి సమాజం కోసం మంచి పనులు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం కల్పించుకోవాలని ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఆ తపనతోనే తన జీవితమంతా ధారపోసి, ప్రజల కోసం పని చేస్తున్నానని చెప్పారు. 40 ఏళ్లుగా తాడిపత్రి ప్రజలు తమ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని... వారందరి గుండెను గుడిలా చూసుకుంటున్నానని అన్నారు.

jc prabhakar reddy
tadipatri
Telugudesam
mla

More Telugu News