సప్నా చౌదరి డ్యాన్స్ కార్యక్రమంలో తొక్కిసలాట!
- రాజ్ గఢ్ లో సప్నా చౌదరి నృత్య కార్యక్రమం
- అంచనాలకు మించి వచ్చిన అభిమానులు
- పోలీసుల లాఠీ చార్జ్
స్టేజ్ పైకి సప్న రాగానే, తమ సీట్లపై నుంచి లేచిన అభిమానులు ముందుకు తోసుకు వచ్చారని, నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయని కారణంగా తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. అంచనాలకు మించి అభిమానులు రావడంతో కార్యక్రమం ప్రారంభం నుంచే వారిని అదుపు చేయడం కష్టమైందని, ఓ దశలో పోలీసులతో ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారని అన్నారు. పోలీసులపై రాళ్లు పడటంతో, ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని అన్నారు.
తొక్కిసలాట జరుగుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు, సప్నా చౌదరిని క్షేమంగా వేదికపై నుంచి దించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు. కాగా, గత సంవత్సరం నవంబర్ లో బెగూసరాయ్ లో జరిగిన ఛాత్ పూజలో డ్యాన్స్ చేసేందుకు సప్న వచ్చిన వేళ కూడా ఇదే తరహా ఘటన జరుగగా, ఒకరు మరణించారు. మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి.