Andhra Pradesh: అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డయినా తింటారు.. బురద చల్లటం ఆయన నైజం!: ఆర్కే రోజా
- చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
- టీడీపీ-జనసేనకు ఒకే ఫైనాన్షియర్ ఉన్నారు
- రాబోయే ఎన్నికల్లో విజయం జగన్ దే
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటారనీ, అవసరమైతే గాడిద కాళ్లు పట్టుకుంటారని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్ తో జతకట్టిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ తో అంటకాగుతున్నారని విమర్శించారు. పార్టీలతో జతకట్టడం, ఆ తర్వాత వారిపైనే బురద చల్లడం చంద్రబాబు నైజమని వ్యాఖ్యానించారు.
600 అబద్ధాల హామీలు ఇచ్చిన చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు, సొంతంగా వైసీపీని స్థాపించిన జగన్ కు తేడా కేవలం 5 లక్షల ఓట్లేనని తెలిపారు. చంద్రబాబుకు ఫైనాన్షియర్ గా ఉన్న లింగమనేని ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు కూడా ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ-జనసేన బంధానికి ఇంతకు మించిన సాక్ష్యాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్టీలన్నీ విడివిడిగా వచ్చినా, ఒక్కటై వచ్చినా రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు.
600 అబద్ధాల హామీలు ఇచ్చిన చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు, సొంతంగా వైసీపీని స్థాపించిన జగన్ కు తేడా కేవలం 5 లక్షల ఓట్లేనని తెలిపారు. చంద్రబాబుకు ఫైనాన్షియర్ గా ఉన్న లింగమనేని ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు కూడా ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ-జనసేన బంధానికి ఇంతకు మించిన సాక్ష్యాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్టీలన్నీ విడివిడిగా వచ్చినా, ఒక్కటై వచ్చినా రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు.