పశ్చిమ బెంగాల్ లో రైతుబంధు, పంట బీమా తరహా పథకాలు.. సీఎం మమతాబెనర్జీ ప్రకటన

  • పంట పెట్టుబడి సాయం కింద రూ.5 వేలు
  • రైతు చనిపోతే రూ.2 లక్షల నష్టపరిహారం
  • పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ప్రకటించాయి. తాజాగా, పశ్చిమబెంగాల్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్ లో రైతుబంధు, రైతుబీమా తరహా పథకాలు అమలు కానున్నాయి. ఈ విషయాన్ని సీఎం మమతాబెనర్జీ పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి కింద ఏటా ఎకరానికి రూ.5 వేల ఆర్థికసాయంను అందజేస్తామని చెప్పారు. 18-60 మధ్య వయసు గల రైతులు మృతి చెందితే బాధిత రైతు కుటుంబానికి రూ.2 లక్షలు నష్టపరిహారం అందజేస్తామని, పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని  మమతాబెనర్జీ ప్రకటించారు.
Go Back to Shorts
west benga
rythu bandhu
rythu bhima

More Telugu News