కేసీఆర్ ఓ జీరో.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి ప్రధాన్!
- సున్నా, సున్నా కలిస్తే వచ్చేది జీరోనే
- ఫెడరల్ ఫ్రంట్ పై కేంద్ర మంత్రి వ్యాఖ్య
- నవీన్ పట్నాయక్ ను కలిసిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనలతో తమకు వచ్చే నష్టం ఏమీ లేదని ప్రధాన్ తెలిపారు. కేసీఆర్ వల్ల ఎన్నికల ఫలితాలు ప్రభావితం కాబోవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను ఆయన జీరోగా అభివర్ణించారు. ‘ఓ సున్నా ఇంకో సున్నాతో కలిస్తే మిగిలేది కూడా సున్నానే’ అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.