తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పిందే నేను: గులాంనబీ ఆజాద్
- అమరుల త్యాగాలను, విద్యార్థుల పోరాటాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా
- కేసీఆర్ 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు
- తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదు
అమరుల త్యాగాన్ని, విద్యార్థుల పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రం లేదన్నారు. రేవంత్ రెడ్డి పేరు చెబితేనే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని, ఈ ఎన్నికల్లో ఆయన 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని ఆజాద్ జోస్యం చెప్పారు.