హనుమంతుడు దళితుడంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ సొంత పార్టీ మంత్రి
- హనుమంతుడు అణగారిన వర్గ దళితుడు
- దేవుళ్లను కులాల పేరుతో విభజించడం తప్పు
- ఇలాంటి వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించొద్దు
బీజేపీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్ దేవుళ్లను కులాల పేరుతో విభజించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు షాల్మీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. యోగి వ్యాఖ్యల కారణంగా దళితులు హనుమాన్ దేవాలయాల స్వాధీనం కోసం డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించొద్దని హితవు పలికారు.