ఈసారి ఏకంగా బుల్లెట్లతో కేజ్రీవాల్ వద్దకు... ముందే పసిగట్టి అరెస్ట్ చేయడంతో తప్పిన ముప్పు!

  • గత వారంలో కారంపొడితో దాడి
  • తాజాగా కేజ్రీవాల్ ను కలిసేందుకు వచ్చిన ముస్లిం ప్రతినిధులు
  • ఓ వ్యక్తి వద్ద ఐదు లైవ్  బుల్లెట్లు
  • విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కల్పిస్తున్న భద్రతపై మరోసారి సందేహాలు వ్యక్తమయ్యాయి. గత వారంలో ఆయనపై కారంపొడితో దాడిని మరువకముందే, ఈ దఫా ఓ వ్యక్తి ఏకంగా ఐదు లైవ్ బుల్లెట్లతో కేజ్రీవాల్ వద్దకు వచ్చాడు. అయితే, ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

కొందరు ముస్లిం ప్రతినిధులు కేజ్రీవాల్ ను కలిసేందుకు రాగా, వారిలో మొహమ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి వద్ద ఈ బుల్లెట్లు లభ్యమయ్యాయి. అతన్ని తనిఖీ చేస్తుండగా, వాలెట్ లో ఈ బుల్లెట్లు సెక్యూరిటీ గార్డులకు కనిపించాయి. దీంతో ఆయుధాలను కలిగివున్నాడన్న నేరంపై అతన్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని మస్జిద్ బావ్లీ వాలీకి ఇమ్రాన్ కేర్ టేకర్ గా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

కాగా, ఈ  బుల్లెట్లు తనకు మసీదులోని హుండీలో లభ్యమయ్యాయని, వాటిని తాను వాలెట్ లో ఉంచుకుని, మరచిపోయానని నిందితుడు చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతన్ని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
New Delhi
Arvind Kejriwal
Live Bullets
Police
Arrest

More Telugu News